టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ తప్ప మరోపార్టీకి లేదని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. కేసీఆర్పై పోరాటం చేస్తున్న తనకు బీజేపీ మద్దతు లేకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. కాంగ్రెస్ నేతలతో కలిసి కేసీఆర్పై పోరాటం ఉధృతం చేస్తానంటున్నారు నాగం జనార్దన్ రెడ్డితో. తన తర్వాతి టార్గెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. పార్టీలో తన రాకను ఎవరూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అధిష్టానం నుంచి సహాయ సహకారాలు కావాలని కోరగా, తన సహకారం ఉంటుందని రాహుల్ గాంధీ తెలిపినట్టు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, వాటన్నింటిపై పారాడనున్నట్టు నాగం ఈ సందర్భంగా తెలిపారు.