భావోద్వేగానికి గురైన ముఖేష్‌ అంబానీ

Update: 2018-12-13 15:45 GMT

ఆకాశమంత పందిరి - భూదేవంత అరుగు, అతిథులు - ఆర్భటాలు, విందులు - వినోదాల మధ్య భారతదేశ ప్రఖ్యాత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహం ఆనంద్‌ పిరమిల్‌ తో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు.. విదేశీ అతిథుల హాజరయ్యారు. మూడు ముళ్ల బంధంతో ఇషా - ఆనంద్‌లు ఒక్కటయ్యారు. అయితే ఈ పెళ్లి వేడుకలో ముకేశ్ అంబానీ కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లు అపురూపంగా పెంచుకున్న తన కూతురు మెట్టినింటికి వెళుతుండడంతో ఆయన ఆనందబాష్పలతో భావోద్వేగానికి గురయ్యారు. ఎంత అపరకుబేరుడైన ఆయన కూడా ఓ ఆడపిల్లకు తండ్రేగా.. అందుకే ముకేశ్ అంబానీ కూడా భావోద్వేగానికి గురవడం సహజంగానే జరిగింది.  బుధవారం రాత్రి ముంబైలోని అంబానీ నివాసం అంటిలియాలో జరిగిన ఈ వేడుకకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ సైతం హాజరయ్యారు. 

Similar News