టీఆర్‌ఎస్‌లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీట్లు...పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై వేటు?

Update: 2018-12-13 05:51 GMT

టీఆర్ఎస్‌ పార్టీలో ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. అలాగే కొందరిపై వేటు వేసేందుకు కూడా గులాబీ పార్టీ రెడీ అవుతుంది. ఎమ్మెల్సీలు పట్నం నరేందర్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఆ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. అటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాములునాయక్‌లపై  చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్‌ నేతలు మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. 

Similar News