టీఆర్ఎస్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీట్లు...పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై వేటు?
టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. అలాగే కొందరిపై వేటు వేసేందుకు కూడా గులాబీ పార్టీ రెడీ అవుతుంది. ఎమ్మెల్సీలు పట్నం నరేందర్రెడ్డి, మైనంపల్లి హనుమంతరావులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఆ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. అటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాములునాయక్లపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్ఎస్ నేతలు మండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేయనున్నారు.