హైదరాబాద్ సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మూసాపేట్ బ్రిడ్జీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతుడి బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే ఆందోళన చేపట్టారు. దీంతో మూసాపేట్ బ్రిడ్జీ ప్రాంతంలో వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇటు రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.