కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లో టీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. టీఆర్ఎస్కే కంచుకోటగా నిలిచే మార్కల్ గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గ్రామాభివృద్ధికి గతంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు గ్రామంలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు గ్రామానికి వెళ్లేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. దీంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.