మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు జంపన్న లొంగిపోయారు. ఆయనతో పాటు భార్య రంజిత కూడా వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మధ్యవర్తిత్వం ద్వారా జంపన్న దంపతులు లొంగిపోయినట్లు సమాచారం. రెండు రోజుల్లో పోలీసులు అధికారిక ప్రకటన చేయనున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రురు మండలం చెర్లపాలెం కు చెందిన జంపన్న 40ఏళ్ల క్రితం అప్పటి పీపుల్స్ వార్లో చేరి పార్టీలో అంచలంచలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. కాగా జంపన్న తలపై 40లక్షల రూపాయల రివార్డ్ ఉంది.