ముంబైలో మరో ఆన్లైన్ మోసం వెలుగుచూసింది. ఐ ఫోన్ కోసం ఆర్డర్ ఇచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అడ్డంగా బుక్కయ్యాడు. ఆన్లైన్లో ఐఫోన్ 8ని బుక్ చేశాడు. కొరియర్ రావడంతో ఎంతో ముచ్చటపడి కొనుకున్న ఐఫోన్ను చూద్దామని ఆశతో బాక్స్ ఓపెన్ చేసి షాకయ్యాడు. అతనికి డెలివరీ అయ్యింది ఐఫోన్ 8 కాదు ఓ బట్టల సబ్బు. ముంబైకి చెందిన తబ్రేజ్ మెహబూబ్ ఫ్లిప్కార్టులో 55వేల రూపాయలు పెట్టి ఐఫోన్ 8ను బుక్చేశాడు. అయితే జనవరి 22న అతనికి ఐఫోన్ బదులు ఓ సబ్బు డెలివరీ అయింది. దాంతో బైకుల్లా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.