కేసీఆర్ తో పాటు మహముద్ అలీ ప్రమాణం

Update: 2018-12-13 07:42 GMT

తెలంగాణ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. కాసేపట్లో కేసీఆర్ పట్టాభిషేకం జరగబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు మహముద్ అలీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ కు రావాలని మహముద్ అలీకి పిలుపు వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాజ్ భవన్ కు బయల్దేరారు. గతంలో మహముద్ అలీ డిప్యూటీ సీఎంగా, రెవెన్యూ మంత్రిగా సేవలందించిన విషయం తెలిసిందే. ఈ నెల 18న మంత్రివర్గ ప్రమాణంతో పాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేసే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకులు తరలివచ్చారు.
 

Similar News