సిరిసిల్లలో నామినేషన్ వేసిన కేటీఆర్

Update: 2018-11-19 09:32 GMT

సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆర్డీవో కార్యాలయంలో స్థానిక సీనియర్ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. సిరిసిల్ల నుంచి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కేటీఆర్ నామినేషన్ పత్రాలను నియోకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావుకు అందజేశారు. అంతకుముందు సిరిసిల్లలో మంగళవారం సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. సభా ప్రాంగణం మొత్తం కలియతిరిగి మార్పులు చేర్పులపై స్థానిక నేతలకు సూచనలు చేశారు. కేటీఆర్ వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.

Similar News