టీపీసీసీ నేతలపై కుంతియా అసహనం

Update: 2018-06-01 10:47 GMT

టీపీసీసీ నేతలపై కాంగ్రెస్ ఇంఛార్జ్ కుంతియా చిర్రుబుర్రులాడారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా గులాం నబీ ఆజాద్‌ని నియమించారంటూ చేస్తున్న ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు. బస్సు యాత్ర  కోఆర్డినేషన్ సమావేశంలో ఈ ఘటన జరిగింది. ఆజాద్‌‌ను స్వాగతిస్తూ కొందరు నేతలు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టడంపై కుంతియా మండిపడ్డారు. తనను తొలగించకముందే ఆజాద్‌‌ను స్వాగతిస్తూ పోస్టింగులు ఎలా పెడతారని కుంతియా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై..ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని నిలదీశారు. 

Similar News