మధ్యప్రదేశ్ 18వ సిఎంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్నాథ్ ఈనెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భోపాల్లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో ఆయన ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరగనుంది. కాగా సుదీర్ఘ మంతనాల తర్వాత పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కమల్ నాథ్వైపే మొగ్గు చూపారు. దీంతో కమల్ నాథ్కు లైన్ క్లియర్ అయింది. యువనేత జ్యోతిరాదిత్య సింధియా కూడా సీఎం కూర్చిని ఆశించినప్పటికీ సీనియర్ నేత కమల్నాథ్నే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఎంపిక చేశారు. ఈ మేరకు కమల్నాథ్ను సీఎంగా నిర్ణయించినట్లు గురువారం రాత్రి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. మధ్యప్రదేశ్లో 230 స్థానాలుండగా కాంగ్రెస్ 114 చోట్ల, బీజేపీ 109, బీఎస్పీ 2, సమాజ్వాదీ పార్టీ 1, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వడంతో.. ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్దమైంది.