రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా లక్షా 12 వేల ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతాం అని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఐటీఐ కాలేజీ బిల్డింగ్ ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్ కలిసి ప్రారంభించారు. తర్వాత సభలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.