తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రథమ వర్థంతి నేడు. ఈ సందర్భంగా అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు, పలువురు సినీ ప్రముఖులు అమెకు ఘన నివాళి అర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద గల జయలలిత సమాధి వద్దకు వేలాది మంది ప్రజలు తరలివచ్చి ఆమెకు నివాళులర్పించారు. కొందరు జయతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తన హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జయలలితను ఆ రాష్ట్ర ప్రజలు ‘ అమ్మ’గా ఆరాధిస్తారు. గతేడాది తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 5న కన్నుమూసిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రజలతో జయ మెమోరియల్ కిక్కిరిసిపోయింది.