కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తాగి సభకు వచ్చారంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి మద్యం తాగి అసెంబ్లీకి వచ్చారన్న ఆరోపణలు సభకే అవమానమని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన తప్పు పట్టారు. గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపే సమయంలో తమను మార్షల్స్ బలవంతంగా తోసేశారని దీంతో తాను వెనక కూర్చున్నానని జానారెడ్డి వివరించారు. అయినా సభ్యులెవరైనా తాగి వస్తే స్పీకర్ చర్యలు తీసుకుంటారని జానా అన్నారు.