కాంగ్రెస్ రెబల్స్టార్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీరు పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో జానా ఆగ్రహంతో ఉన్నారు. సీఎల్పీ సమావేశంలో కోమటిరెడ్డి తన తీరును మార్చుకోవాలని జానా హెచ్చరించినట్లు తెలిసింది. బహిరంగంగా ఎలా ప్రశ్నిస్తావంటూ నిలదీసినట్లు సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం వాడివేడిగా జరిగింది. పదేపదే బహిష్కరణ ఎమ్మెల్యేల తీరును పార్టీ సభ్యులు తప్పుబట్టినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీరు పార్టీ సభ్యులు తప్పుబట్టినట్టుగా ప్రచారం జరగుతోంది. ఇటీవల జానారెడ్డి బహిరంగంగా ఆయన ముందే విమర్శలు చేయడంపై పార్టీ సభ్యులందరూ అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది.
అంతర్గంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా ఎలా ప్రశ్నిస్తారంటూ అందరు నేతలు నిలదీసినట్లు సమాచారం. ఇక మూకుమ్మడి రాజీనామల అంశం పార్టీలో చర్చంచకుండా మీరు రాజీనామాలు చేయాలని ఎలా డిమాండ్ చేస్తారని సభ్యులందరూ కోమటిరెడ్డిని ప్రశ్నించిన్నట్లు తెలుస్తోంది. సంపత్ మాత్రం ఇప్పుడే రాజీనామాలు కాకుండా ఉద్యమాలు చేసి చివరి అస్త్రంగా రాజీనామాలు ప్రయోగిద్దామని చెప్పిన్నట్లు సమాచారం.
అసెంబ్లీ మీడియా పాయింట్లో తన కోమటిరెడ్డి చేసిన వాగ్వాదాన్ని జానా సీనిరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. బహిరంగంగా తనపై ఎందుకు వ్యాఖ్యలు చేరారంటూ జానా మందలించినట్లు ప్రచారం జరుగుతోంది. సభ్యుల కోసం తాను పోరాటం చేయడంలేదని ఎలా అంటావంటూ జానా కోమటిరెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారం. కోమటిరెడ్డి తీరు మార్చుకోవాలని జానా హెచ్చరించిన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. రాజీనామాల విషయంలో తొందరపడవద్దని, సంయమనం పాటించానలి జానా సూచించినట్లు తెలుస్తోంది.