ముందస్తు ఎన్నికలకు సిద్దమవుదామనుకుంటున్న టిఆర్ఎస్ జమిలి ఎన్నికలకు జై కొట్టింది. జమిలి ఎన్నికలపై పార్టీల అభిప్రాయం తెలుసుకుంటున్న లా కమిషన్ ముందు టీఆరెస్ నేతలు హాజరయ్యారు. ఒకేసారి ఎన్నికలు ఉండాలన్న ఆలోచనతో తాము ఉన్నామని తెలిపారు ఎంపీ వినోద్ కుమార్. ఒకేసారి ఎన్నికలుంటే ప్రజాధనం ఆదా చేయొచ్చన్నారు. అయితే ఇది ముందస్తు కాదని ఎంపీ వినోద్ తెలిపారు.