తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువనుంచి వస్తున్న వరదతో గోదావరి జలకళ సంతరించుకుంది. పెన్గంగ ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టులకు నీరు చేరుతోంది. మరో నాలుగు రోజులు వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని బెంగాల్, ఒడిశాలపై ఆవరించిన ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.