తమిళనాడును వణికిస్తున్న వరుణుడు

Update: 2018-11-23 02:00 GMT

మొన్నటిదాకా తమిళనాడును గజ తుఫాను తీవ్రంగా వణికించిన సంగతి తెలిసిందే. గజ తుపాను దాటికి తమిళనాడు తీర ప్రాంతాలు వరదలతో మునిగిపోయాయి, అయితే మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చెన్నై సహా 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ తెలిపింది. కాంచీపురం, విల్లుపురం, తిరువళ్లూరు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అలాగే తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటోంది. ఈ వర్ష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ హెచ్చరికలతో అధికారయంత్రాంగం అప్రమత్త మైంది. చెన్నై సహా 7 జిల్లాల్లో విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవులు ప్రకటించింది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Similar News