టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. సిద్దిపేటలో హరీష్ రావు దాదాపు 80వేల మెజార్టీతో గెలుపొందారు. టీఆర్ఎస్ ఇప్పటికి 86స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఏడుగురు అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ 18స్థానాల్లో, ఎమ్ఐఎమ్ 4, బీజేపీ 2, ఇతరులు ఒక్కస్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కూకట్పల్లిలో నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు.