దేశంలోనే సంపన్నుడు.. ఆధునిక కుబేరుడు అయిన ముకేశ్ అంబానీ దంపతుల ముద్దుల తనయ.. ఈశా అంబానీ నిశ్చితార్థ వేడుక.. అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని తన సొంత నివాసం అయిన యాంటిలాలో జరిగిన వేడుక కోసం.. తారాలోకం తరలివచ్చింది. ఈ వేడుకలో అంబానీ సోదరులిద్దరూ ఒకటిగా కనిపించారు. రెండు ఫ్యామిలీలు ఒక్కచోట చేరాయి. లేత గులాబీ రంగు లెహగాలో.. మెరిసిపోయిన ఈశా.. తన తండ్రి ముఖేశ్, తల్లి నీతా తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇటు అంబానీ ఇంట అడుగుపెట్టనున్న ఆకాశ్ కు కాబోయే భార్య శ్లోకాతో కూడా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ కార్యక్రమానికి.. సచిన్, షారూఖ్, ఆమీర్, కరణ్ జోహార్, రణ్బీర్ తదితరులు హాజరయ్యారు.