శబరిమలలో అపశ్రుతి

Update: 2018-03-30 06:14 GMT

శబరిమలలో అపశ్రుతి చోటు చేసుకుంది.  అయప్పస్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఏనుగులతో ఊరేగింపు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి ఓ ఏనుగు పరుగులు పెట్టింది. దీంతో  భక్తులు, పోలీసులు తలో వైపు పరుగులు పెట్టారు. ఏనుగును నియంత్రించేందుకు మావటీలు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో  తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో  భక్తులతో పాటు పలువురు  పోలీసులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు భక్తుల పరిస్ధితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  

Similar News