టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పై ఆయన కుమారుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎంపీ కవిత పట్టించుకోవటం లేదని, సీనియర్ నేత, రాజ్యసభ సభ్యునిగా ఉన్న డి.శ్రీనివాస్ ఈ సమస్య పై దృష్టి సారించాలని సూచించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి డిఎస్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా చక్కెర ఫ్యాక్టరీల లాబీయింగ్లకు తలొగ్గి బోధన్, ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించడం లేదన్నారు.