హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరిలో మరో డ్రగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. రాజస్థాన్కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరి నుంచి 56 గ్రాముల హెరాయిన్, కిలో ఓపియంను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. వీరిద్దరూ రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. నగరంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.