ట్రంప్ కోసం గుడి...త్వరలోనే కలుద్దామంటూ జనగామ జిల్లావాసికి అమెరికా అధ్యక్షుడు ట్వీట్‌

Update: 2018-06-22 08:09 GMT

వుయ్ హేట్ ట్రంప్ పేరుతో  ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే  జనగామ జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం తనకు ట్రంపే దైవమంటున్నాడు.  మాటలతో చెప్పడమే కాదు నిత్యం పూజలు, రక్తతర్పణాలు చేస్తూ ట్రంప్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు. దీనికి ట్రంప్ సైతం ముగ్ధుడై  అభిందిస్తూ ట్వీట్ చేశాడు.  బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ  ట్రంప్‌కు వీరాభిమాని. అమెరికా అధ్యక్ష భాద్యతలు స్వీకరించినప్పటి నుంచి  తన ఇంట్లో ట్రంప్‌ ఫోటోను పెట్టి  పూజలుచేస్తున్నాడు. ప్రతి రోజు తన పూజా కార్యక్రమాలను  ఫేస్‌బుక్‌‌లో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ దృశ్యాలను అటాచ్ చేస్తూ క్రిష్ణ స్నేహితులు కొందరు ట్రంప్‌కు ట్వీట్ చేశారు. వీటిని చూసి ఆశ్చర్యానికి గురైన ట్రంప్ .. క్రిష్ణను అభినందిస్తూ రీ ట్వీట్ చేశారు.  కోట్ల మంది భారతీయుల్లో కృష్ణ  తన ఆప్తమిత్రుడిగా భావిస్తున్నాననీ, త్వరలోనే కలుద్దామని పేర్కొన్నారు. . దీంతో ఆనందం వ్యక్తం  చేసిన క్రిష్ణ  ట్రంప్‌లోని ముక్కుసూటితనం, చురుకుదనం తనకెంతగానో నచ్చుతాయన్నారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు కాకముందు చాలా ఏళ్లక్రితం డబ్ల్యూడబ్ల్యూఈ అనే కార్యక్రమంలో హోస్ట్‌గా వచ్చేవారనీ, చాలా ఉత్సాహంగా పాల్గొనేవారనీ, తొలిసారిగా ఆయన్ని అక్కడే చూశానన్నారు.

Similar News