దక్షిణ కర్ణాటకలో వరదలు వచ్చాయి. ఈ ధాటికి దర్శకుడు సంతోశ్శెట్టి మృతిచెందాడు. షూటింగ్ లో భాగంగా దక్షిణ కన్నడ మిత్తబాగిలులోని ఎర్మయ్ ఫాల్స్లో షూటింగ్కు వెళ్లారు. ఆ సమయంలో సంతోశ్శెట్టి తన కాలికి బరువైన వస్తువు కట్టుకున్నాడు. దీంతో సడన్ గా వరదలు రావడంతో పరుగెత్తలేకపోయారు. ఈక్రమంలో వరదప్రవాహంలో కొట్టుకుపోయారు. ఉదృతి తగ్గుముఖం పట్టినతరువాత అతనికోసం గాలించగా విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాగా సంతోశ్శెట్టి 'కనసు' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.