కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తో బేటీపై స్పందించారు రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పారు. పలువురు నాయకులను సహజంగానే కలుస్తుంటానని అందులో భాగంగానే రాహుల్ గాంధీని కలిశానని డి.శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు టీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీ రాములునాయక్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉదయం రాహుల్ గాంధీని కలిసిన ఇరువురు నేతలు ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇద్దరు టీఆర్ఎస్ నేతల చేరికతో తెలంగాణలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అన్నారు.