మహాకూటమిలో భాగంగా కేటాయించిన మూడు స్థానాలకు సీపీఐ అభ్యర్థులను ప్రకటించింది. హుస్నాబాద్ నియోజకవర్గం అభ్యర్థిగా చాడ వెంకట్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి గుండా మల్లేశ్, వైరా నుంచి బానోతు విజయబాయ్ పోటీ చేస్తారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ప్రకటించారు. బెల్లంపల్లి అభ్యర్థి ఎవరన్న విషయమై ఆఖరి క్షణం వరకు పార్టీలో చర్చ జరిగింది. ఎట్టకేలకు గుండా మల్లేశ్ పేరును ఖరారు చేసింది.