రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపై స్పందించిన యోగి!

Update: 2018-12-13 12:56 GMT

తాజాగా ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ గట్టి ఎదురుదెబ్బె తగిలిందని తెలిసిందే. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీకి ఘోరపరజయం చవిచూసింది. ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్ తన సత్తా చాటుకుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ విజయాలపై ఎట్టకేలకు తాజాగా బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామిలతోనే గెలిచిందన్నారు. కాంగ్రెస్ అడిన అబద్దాలు అతి త్వరలోనే వెలుగులోకి వస్తాయని అన్నారు. వీళ్ల అబద్దాలే త్వరలో బీజేపీ భవిష్యత్తు ఎన్నికల్లో తప్పకుండ లాభపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ సహా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో యోగి విస్తృతంగా పర్యటించిన లాభం లేకుండా పోయింది. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌ సమరంగా భావిస్తున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపును ఆయన తేలిక చేసి మాట్లాడారు.
 

Similar News