సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి అన్ని పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాలలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో మంత్రి ఈటలతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. 30 ఏండ్లుగా కాంగ్రెస్లో ఉన్న నాయకులు సైతం పార్టీని వీడి టీఆర్ఎస్లోకి వస్తుండటం చూసి ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుడుతున్నదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎప్పు డూ పార్టీలు, వ్యక్తులకు ప్రాధాన్యమివ్వరని, అభివృద్ధి, సం క్షేమం ఎజెండాగా రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తుందని, జగిత్యాల గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్కు సైనికుడిలా పని చేస్తున్న సంజయ్ కుమార్కు మద్దతుగా నిలిచి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కాగా జగిత్యాలలో సోమవారం మంత్రి ఈటల రాజేందర్తో కలిసి ఎమ్మెల్యే జీవన్రెడ్డి నిజామాబాద్ ఎంపీ కవిత కారు ఎక్కడం చర్చనీయాంశంగా మారింది.