కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు రాహుల్ అక్కడకు వెళ్లారు. అయితే ఆ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన ఎమ్మెల్యే ఆశా కుమారికి చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించబోయి.. చెంప దెబ్బ తిన్నారు. ఎమ్మెల్యే ఆశా కుమారి కార్యాయలం దగ్గరకు చేరుకున్నారు. అయితే పోలీస్ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆమె వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఓ మహిళా కానిస్టేబుల్ చెంప పగలకొట్టారు. అయితే దానికి ప్రతిగా ఆ కానిస్టేబుల్ కూడా ఆమె చెంప వాయించింది. వివాదం ముదరడంతో అక్కడే ఉన్న వారు ఆ ఇద్దర్నీ నిలువరించే ప్రయత్నం చేశారు.