బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్..

Update: 2018-09-27 04:24 GMT

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ నూతన కస్టమర్లకు సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అందిస్తోంది. రూ.299 తో రీఛార్జ్ చేసుకుంటే 31 జీబీ డేటా లభించనుంది. ఈ ప్లాన్‌ తో రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపించుకోవచ్చు, అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే ప్లాన్ కేవలం నూతన బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. అంతేకాకుండా జియో తరహా రూ.199 ప్లాన్ కూడా లాంచ్ చేసింది. రూ.199 లతో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో యూజర్లకు 25 జీబీ డేటా ఉచితంగా లభించనుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉన్నాయి.

Similar News