ఢిల్లీ... రాజ్ పథ్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్కు చెందిన మహిళా సైనికులు అద్భుత ప్రదర్శన చేశారు. సీమా భవానీ వుమన్ బైకర్స్ విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆర్డీ పరేడ్లో మహిళా మోటర్ సైకిల్ టీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టెకాన్పూర్లో ఉన్న బీఎస్ఎఫ్ దళాలు ఈ విన్యాసాలు నిర్వహించాయి. సీమా భవానీ డ్రైవింగ్ స్కిల్స్ అందర్నీ అబ్బురపరిచాయి. రైడింగ్ స్టంట్స్తో థ్రిల్ చేశారు. ప్రెసిడెంట్కు సెల్యూట్ చేయడంతో పాటు ఫిష్ రైడింగ్, సైడ్ రైడింగ్ లాంటి స్టంట్లతో సీమా భవానీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
We don't want you to miss this! Get amazed again by the wonderful display of riding skills, by the all-woman Daredevils Team #SeemaBhawani of @BSF_India #RepublicDay pic.twitter.com/Z80XOwMEhD
— PIB India (@PIB_India) January 26, 2018