హైదరాబాద్ బోయిన్పల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బర్త్ డే పార్టీ పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ యువకులకు లాఠీ ట్రీట్మెంట్ ఇచ్చారు. రెండ్రోజుల పాటు లాకప్లో వేసి చితకబాదినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగంటే ఇదేనా? అని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. తోడ్కలు ఉడిపోయేలా ఆ యువకులను చితకొట్టారు. ప్రస్తుతం ఆ యువకుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ బోయిన్ పల్లిలో సాయి ముదిరాజ్ అలియాస్ దగడ్ సాయి పుట్టిన దిన వేడుకలకు మంగళవారం సాయంత్రం జరిగాయి అయితే ఒక వ్యక్తి ఇక్కడ అంత ఇబ్బంది ఉందని పోలీసులకు ఫిర్యాదుచేయగా పుట్టినరోజు పేరుతో న్యూసెన్స్ చేస్తారా అని తొమ్మిది మంది యువకులను బోయిన్ పల్లి పోలీసు ఠాణాకు తరలించి అక్కడ పోలీసులు చితకొట్టారు.