గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రమాదం తప్పింది. ఔరంగాబాద్లో సభ ముగించుకొని హైదరాబాద్ వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టబోయింది. అయితే, డ్రైవర్ అప్రమత్తతో కారును తప్పించగా వెనక ఉన్న మరో కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోగా క్లీనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.