బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు తెలంగాణ బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. పార్టీలోకి వస్తే ఎంపీ సీటు ఇస్తామంటూ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన యెన్నం శ్రీనివాసరెడ్డితో పాటు ఎవరూ వచ్చిన ఆహ్వానిస్తామన్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన తొలి విడత అభ్యర్ధుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేస్తామని లక్ష్మణ్ ప్రకటించారు. వచ్చే నెలలో అమిత్షాతో వరంగల్, కరీంనగర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు.