తొలి జాబితాపై కాంగ్రెస్లో రాజుకున్న మంటలు...పార్టీకి రాజీనామా చేసే యోచనలో ...
కాంగ్రెస్లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. తొలి జాబితాలో చోటు దక్కని నేతలు అధిష్టాన వైఖరిపై భగ్గుమంటున్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా కేటాయించిన స్ధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి స్ధానాన్ని టీడీపీకి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుచరులతో భేటి అయిన ఆయన పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో వరంగల్ జిల్లాలోనూ అసంతృప్తుల ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వరంగల్ వెస్ట్ సీటును టీడీపీకి కేటాయించడంపై డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితా వెలువడిన వెంటనే అనుచరులు,కార్యకర్తలతో భేటి అయిన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటూ కార్యకర్తలు సూచించడంతో కాంగ్రెస్కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.