సికింద్రాబాద్ బోయిన్పల్లి చెక్ పోస్టు సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి దీపావళి నిప్పు రవ్వలు పడడంతో టింబర్ ఇండియా డిపోలో అగ్నికి ఆహుతైంది. మంటల్ని అదుపు చేయడానికి 3 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అయినా టింబర్ డిపో మొత్తం దగ్ధమైపోయింది. దాదాపు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా.