తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు ఎన్నికల సంఘం(ఈసీ) షాకిచ్చింది. ఈ రోజు జరగాల్సిన రోడ్ షో లో పాల్గొనేందుకు అనుమతిని నిరాకరించింది. దీంతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. నిబంధనల ప్రకారం 48 గంటల ముందు రోడ్డుషోకు అనుమతి కోరాల్సి ఉండగా అలా చేయకపోవడంతో అనుమతివ్వలేదని ఈసీ పేర్కొంది. చివరి క్షణంలో రోడ్షోకు అనుమతి కోరడంతో ఈసీ అనుమతి నిరాకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 1 నుంచి హైదరాబాద్లో బాలకృష్ణ విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నయ్య హరికృష్ణ కుమార్తె, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుహాసినికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.