రాజస్థాన్ సీఎం ఎవరనే దానిపై వీడిన సస్పెన్స్!

Update: 2018-12-14 10:37 GMT

నిన్నటి వరకు రాజస్థాన్ సీఎం పీఠం అధిష్టించేదెవరో అని అందరిలోనూ నెలకొన్న ఉత్కంఠ వీడింది. మొత్తానికి సీఎం పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలట్ హోరాహ‍ోరి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన గెహ్లాట్ మూడోసారి అవకాశం కోసం ఎదురు చూస్తుండగా పీసీసీ చీఫ్‌గా ఉండి పార్టీని విజయపథంలో నడిపించిన పైలట్ కూడా ఆ రేసులో ముందున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో మంతనాల నడిపి ఎట్టకేలకు ఏఐసీసీ అశోక్ గెహ్లాట్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం చేసి ప్రస్తుతమున్న కాంగ్రెస్ చీఫ్ పదవిలో కూడా కొనసాగాలని సచిన్ పైలట్‌కు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం. ఇక అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Similar News