కేసీఆర్‌తో భేటీపై అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2018-12-10 07:40 GMT

అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాసేపట్లో కేసీఆర్‌తో సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన ట్వీట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిముషాలకు కలబోతున్నట్లు తెలిపారు. దేవుడి దయతో కేసీఆర్‌ తన సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు మజ్లీస్‌ అండగా ఉంటుందని తెలిపారు. దేశ నిర్మాణంలో తమ కలయిక తొలి అడుగుగా ఒవైసీ అభివర్ణించారు. 
 

Similar News