ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఒక వేయి 51 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామకాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 27 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. వచ్చే ఏప్రిల్ 21న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 2న మెయిన్స్ పరీక్ష ఉంటుంది.
జిల్లాల వారీగా ఖాళీలు
.................................
శ్రీకాకుళం- 114, విజయనగరం- 120, విశాఖ- 107
తూర్పు గోదావరి- 104, పశ్చిమ గోదావరి- 25
కృష్ణా- 22, గుంటూరు- 50, ప్రకాశం- 172
నెల్లూరు- 63, చిత్తూరు- 141, అనంతపురం- 41
కర్నూలు- 90, కడప- 02