సుహాసినిని చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి: పరిటాల సునీత

Update: 2018-11-27 06:34 GMT

టీడీపీ కంచుకోట కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని గెలుపు ఖాయమన్నారు ఏపీ మంత్రి పరిటాల సునీత. కూకట్‌పల్లిలో మహాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరఫున ఆమె ప్రచారం నిర్వహించారు. 70వేల మెజార్టీతో ఆమెను ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సుహాసినిని చూస్తే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు సునీత. తన తండ్రి మరణించారన్న బాధను దిగమింగుకుని, ఆమె ప్రజల వద్దకు వచ్చారని, ఇప్పుడు ప్రజలంతా సుహాసినిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్న 13 చోట్లా విజయం ఖాయమన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు.

Similar News