ఈ ఎన్నికల్లో ఎలాగైన బీజేపీ జెండా ఎగరవేయాలని ఆరాటపడే వ్యక్తి బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. ఎన్నికల ప్రచారంలో భాగంగానే అమిత్ షా మిజోరంలో పర్యటనకు హెలికాఫ్టర్లో వెళ్లాడు. ఇగ మిజోరంలోని ఓ ప్రాంతంలో అమిత్ షా హెలికాఫ్టర్ దిగుతుండగా మెట్లమీది నుండి బొక్కబోర్ల పడ్డాడు. ఆయనతోటి ఇంకో ఇద్దరు ఉన్నారు అమిత్ కిందపడింది చూసి దబుక్కున లేపి అమిత్ షా బట్టలకు ఉన్న దుమ్మును దులిపి మళ్లీ తన ప్రచారం కార్యక్రమానికి చేరుకున్నారు. ఈ ఘటనలో అమిత్ షా కు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వేలుగులోకిచ్చింది. అయితే ఈ ఘటనను కొందరు సెల్ ఫోన్ లో చిత్రికరించి సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియాలో పెట్టడంతో అమిత్ షా వీడియో అమంతం పైకి లేచింది. ఇప్పుడు సోషల్ నెట్ వర్క్లో గి విడియో హల్ చల్ చెస్తుంది. కాగా ఈ విడియో చూసిన నెటిజన్లు అయ్యోపాపం అని సానుభూతి చూపిస్తున్నారు. అయితే మిజోరామ్లో ఈ నెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ముచ్చట తెలిసిందే. వెస్ట్ తుయ్పూయ్ ప్రాంతంలో చక్మా తెగకు చెందిన గిరిజన ప్రజలు అథికసంఖ్యలో ఉండటంతో చక్మా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.