తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ. యాకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తనను చంపుతానంటూ బెదింపు లేఖలు, ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. అహ్మాదాబాద్, కర్ణాటక ప్రాంతాల నుంచి 11 మంది తనను చంపేందుకు హైదరాబాద్లో దిగారని ఆయన చెప్పారు.