అజ్ఞాతవాసి సినిమాలోని ఆ ఒక్కడైలాగ్ ను రాజకీయ పార్టీకి చెందిన నేతలు ఆపాదించుకుంటున్నారు. ఆ డైలాగ్ నీదంటే నీదని తెగ కామెంట్లు చేసుకుంటున్నారు. ఏ కామెంట్లు ఎలా ఉన్నా ఆ ఒక్కడైలాగ్ మాత్రం ఇప్పుడు పొలిటికల్ గా వైరల్ అవుతుంది. రీసెంట్ గా అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అందులో పొలిటికల్ యాంగిల్ ను కవర్ చేసేలా 'వీడు మళ్లీ సైకిల్ ఎక్కుతాడంటావా వర్మా?' అని అడిగితే 'వాడు ఏది ఎక్కినా ఫర్వాలేదు కానీ మనల్ని ఎక్కకుండా వుంటే అదే చాలు' అని డైలాగ్ ఉంది. ఇప్పుడా డైలాగ్ తో తెలుగుతమ్ముళ్లు - వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి పవన్ టీడీపీ కి మద్దతు ఇస్తారా లేదా అనే అంశంపై వైసీపీ కి చెందిన నేతలు చర్చించుకుంటున్నట్లు టాక్ . వారికి బదులిచ్చేలా పవన్ ప్రత్యేకించి ఆ డైలాగ్ ను రిలీజ్ చేశారంటూ టీడీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇక వైసీపీ నేతల విషయానికొస్తే రాష్ట్రంలో ఏదైనా సమస్యలొస్తే తక్షణ పరిష్కారం చేస్తున్న పవన్ సందర్భాను సారం ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ డైలాగ్ టీడీపీ కి ఎగెనెస్ట్ గా ఉందనేది వైసీపీ నేతల వాదన. ఏది ఏమైనా ఇప్పుడా డైలాగ్ నెట్ ఇంట్లో తెగ హల్ చల్ చేస్తుంది.