పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి విడుదల సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు సినిమా టికెట్ల కోసం థియేటర్ల ఎదుట బారులు తీరారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు అయ్యేలా దుబాయ్ లో అజ్ఞాతవాసి సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమా పై దుబాయ్ డిస్టిబ్యూటర్ , సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు రివ్యూ విడుదల చేశారు. ఈ రివ్యూతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఉమైర్ అజ్ఞాతవాసి గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం.
త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేశాయో.. అజ్ఞాతవాసి కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు కొన్ని సన్నివేశాల్లో త్రివిక్రమ్ మాటలు తూటాల్లా పేలాయని అన్నారు. ఆడియో ఫంక్షన్ లో పవన్ విశ్వరూపం చూస్తారని చెప్పినట్లు గానే సినిమా ఆసాంతం పవన్ మేనియాతో అలరించారు. కాకపోతే ఫస్టాఫ్ కొంచెం బోర్ కొట్టేలా ఉందని సెకండాఫ్ లో పవన్ డ్యాన్స్ లు, పాటలు, డైలాగులు , ఇక యాక్షన్ సీన్స్ గత చిత్రాలకంటే ఈసినిమాలో బాగున్నాయని అన్నారు. అంతేకాదు కుటుంబ విలువల్ని జోడిస్తూ అన్నీ ఎలిమెంట్స్ ను బాగా కవర్ చేశారని దీంతో పైసా వసూల్ మూవీ అవుతుందట. దీనికితోడు పోటాపోటీ లేదు కాబట్టి బాక్స్ ఫీస్ ను షేక్ చేస్తుందనడంలో సందేహంలేదు. సినిమా మొత్తం విడుదల కాలేదు కాబట్టి కీలకమైన ఘట్టాలని మాత్రమే రివ్యూలో రాశాడు. మరి ఆయన చెప్పినట్లు సినిమా అభిమానుల్ని ఏ విధంగా అలరిస్తుందో వేచి చూడాలి