తెలంగాణాలో బుధవారం కరోనా పాజిటివ్ కేసులు 41

తెలంగాణాలో బుధవారం 41 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 31 కేసులు జీహెచ్ఎంసీ పరిదిలోనివే. ఇక కరోనా కారణంగా నిన్న ఇద్దరు చనిపోయారు. మొత్తమ్మీద చనిపోయిన వారి సంఖ్యా 34 కు చేరింది. అదేవిధంగా 117 మంది కరోనా వైరస్ నుంచి చికిత్స పొంది బయటపడ్డ్డారు. ఒక్కరోజులో డిశ్చార్జి అయినవారిలో ఇదే పెద్ద సంఖ్య. మొత్తంగా చూసుకుంటే తెలంగాణాలో కోవిడ్-19 బాదితుల సంఖ్య 1367 గా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్యా 394 కాగా, ఇంకా చికిత్స 939 మంది చికిత్స పొందుతున్నారు.




Update: 2020-05-14 01:07 GMT

Linked news