మే 31 వరకు దేవాలయాల్లో భక్తులను అనుమతించడం లేదు : దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం లాక్ డౌన్ కాలపరిమితిని మే నెల 31వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనము లను నిలుపుదల చేయొచ్చు గతంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగించినట్లు దేవదాయ శాఖకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

అన్ని దేవాలయాల్లో యధావిధిగా నిత్య పూజలు. సాంప్రదాయం ప్రకారం కొనసాగుతాయన్నారు. అదే విధంగా ఆర్జిత సేవలు కోసం ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిపి పరోక్షంగా సేవలు అందించే విధంగా అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలని కార్యనిర్వాహక అధికారులను మంత్రి ఆదేశించారు.



 


Update: 2020-05-18 12:48 GMT

Linked news