ఆంద్ర ప్రదేశ్ లో ఉదయం ఆరు గంటల నుంచే అన్నీ బంద్!
- ఆంద్ర ప్రదేశ్ లో విజయవాడతో పాటూ మిగిలిన నగరాలు, పట్టణాల్లో ఉదయం ఆరు గంటల నుంచే జనతా కర్ఫ్యూ ప్రభావం కనిపిస్తోంది.
- అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
- నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా శనివారమే ప్రజలు ముందుగానే తగినట్లు ఏర్పాట్లు చేసుకున్నారు.
- కరోనా పై భయం కాదు అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
నిత్యావసరాల విషయంలో ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావద్దు. అన్ని సరుకులూ యధావిధిగానే షాపుల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాలు ధరలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాయి. కరోనా పేరుతో నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం- సీఎం వైయస్ జగన్ pic.twitter.com/XQhOGOfjDS
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 21, 2020
Update: 2020-03-22 01:51 GMT