Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో దూకుడు
Stock Market: గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం * దేశీ స్టాక్ సూచీలు భారీ లాభాలతో ట్రేడింగ్ షురూ
Representational Image
Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో దూకుడు కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో దేశీ స్టాక్ సూచీలు భారీ లాభాలతో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఉదయం 9.55 సమయంలో సెన్సెక్స్ 353 పాయింట్లు పెరిగి 50,015వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి 14,929 వద్ద ట్రేడవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనల నడుమ కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండా, సర్దుబాటు వైఖరికి ఆర్బీఐ కట్టుబడి వుండటం సానుకూల ప్రభావం చూపుతోంది. ఫలితంగా వడ్డీరేట్లతో సంబంధం ఉన్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్ , ఆటో, రియల్టీ రంగ షేర్లు రాణించడంతోదేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటన సాగుతున్నాయి.